పట్టణాల్లో జనతా బజార్లు: మెప్మా డైరెక్టర్
ABN , First Publish Date - 2020-11-19T09:17:09+05:30 IST
పట్టణాల్లో జనతా బజార్లు: మెప్మా డైరెక్టర్
![పట్టణాల్లో జనతా బజార్లు: మెప్మా డైరెక్టర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు చెంది వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల కింద ఎంపికైన మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించే లక్ష్యంతో అన్ని పట్టణాల్లో జనతా బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ‘మెప్మా’ మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి తెలిపారు. వీటిల్లో డ్వాక్రా ఉత్పత్తులతోపాటు రిలయన్స్, హెచ్యూఎల్, ఐటీసీ వంటి కంపెనీల పలు ఉత్పత్తులు, హస్తకళాకృతులను కూడా విక్రయిస్తామన్నారు.