మేడారం జాతరకు..

ABN , First Publish Date - 2020-02-08T10:54:44+05:30 IST

మేడారం జాతర నేపథ్యంలో సమక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని చెబుతున్నారు.

మేడారం జాతరకు..


తుళ్లూరు, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగేలా చూ డాలని తెలంగాణ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మలను కోరేందుకు రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు మేడారం జాతరకు పయనమయ్యారు. మేడారం జాతర నేపథ్యంలో సమక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా అనుగ్రహించిన సమ్మక్క, సారలమ్మ మహిమగల దేవతలని.. అందుకే అమరావతినే రాజధానిగా కొనసాగేలా చూడమని వారిని మొక్కుకునేందుకు వెళ్తున్నామని మేడారం బయల్దేరిన అనుమోలు అమ్మాజీ అనే మహిళా రైతు తెలిపారు. ఇక్కడి నుంచి బస్సులో 40 మంది మేడారం జాతరకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మలు కచ్చితంగా తమ కోరిక నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-02-08T10:54:44+05:30 IST