మాణిక్యాలరావు మరణం ఎంతగానో బాధించింది: రఘురామకృష్ణంరాజు
ABN , First Publish Date - 2020-08-02T00:13:36+05:30 IST
మాజీ మంత్రి మాణిక్యాలరావు తనకు ప్రియమిత్రుడని, స్నేహితుడని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మాణిక్యాలరావు ..

నర్సాపురం: మాజీ మంత్రి మాణిక్యాలరావు తనకు ప్రియమిత్రుడని, స్నేహితుడని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మాణిక్యాలరావు మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆరు సంవత్సరాలుగా చాలా స్నేహంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా సోకుంతుందన్న ఒక్క రోజు ముందు కూడా మాణిక్యాలరావు తనతో మాట్లాడినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి తగ్గినప్పుడు వచ్చి కలుస్తానని మాణిక్యాలరావుతో చెప్పినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.