శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2020-11-30T13:04:59+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు...

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైలం: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి బారులు తీరారు. అంతేకాకుండా శ్రీశైలం ఆలయ పురవీధుల్లో నుంచి గంగాధర మండపం, నంది మండపం వరకు భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తూన్నారు.

Updated Date - 2020-11-30T13:04:59+05:30 IST