ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై దాడిని ఖండించిన లోకేష్

ABN , First Publish Date - 2020-10-04T02:11:25+05:30 IST

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు.

ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై దాడిని ఖండించిన లోకేష్

అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజద్ బాషాపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. దాడి చేసిన వైసీపీ నేతల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పత్రికాస్వేచ్ఛని హరించే విధంగా జగన్ రెడ్డి జీవో 2430 తీసుకొస్తే.. వైసీపీ నేతలు పాత్రికేయులే ఉండకూడదంటూ దాడులు చేస్తున్నారని లోకేష్‌ ధ్వజమెత్తారు. ‘ఆంధ్రజ్యోతి’ విలేకరిర్ అంజాద్ బాషాపై వైసీపీ నాయకుల అనుచరులు దాడిని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించడం ద్వారా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.


నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అంజాద్ బాషాపై వైసీపీ కార్యకర్తల దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో విలేకరికి తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-04T02:11:25+05:30 IST