లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. వైసీపీ నేతలపై కేసు

ABN , First Publish Date - 2020-04-14T09:16:57+05:30 IST

వైసీపీ నేతలు లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన స్థానిక వైసీపీ నేత బైరెడ్డి ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. వైసీపీ నేతలపై కేసు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 13: వైసీపీ నేతలు లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన స్థానిక వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరూ సోమవారం పటేల్‌ సెంటర్‌లో అనేకమందితో వచ్చి మైక్‌లో మాట్లాడారు. భౌతిక దూరం పాటించకుండా హైపో ద్రావణం పిచికారీ చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నాగరాజారావు తెలిపారు. 

Updated Date - 2020-04-14T09:16:57+05:30 IST