మే 31 వరకు లాక్‌డౌన్‌ విధించాలి: చింతా మోహన్‌

ABN , First Publish Date - 2020-04-12T07:41:31+05:30 IST

కరోనాను సమర్ధంగా ఎదరుర్కోవాలంటే మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ సూచించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని, అది పది నాగుపాముల...

మే 31 వరకు లాక్‌డౌన్‌ విధించాలి: చింతా మోహన్‌

తిరుపతి, ఏప్రిల్‌11(ఆంధ్రజ్యోతి): కరోనాను సమర్ధంగా ఎదరుర్కోవాలంటే మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ సూచించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని, అది పది నాగుపాముల కాటుతో సమానమని హెచ్చరించారు. వెంటిలేటర్లు కూడా ఉపయోగపడవని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని, చైనా 70 రోజుల లాక్‌డౌన్‌ ఫలితాలను పరిశీలించి అయినా మనం కొనసాగించాలని ఆయన కోరారు.


Updated Date - 2020-04-12T07:41:31+05:30 IST