ప్రకాశం జిల్లా: ఒంగోలులో లాక్ డౌన్
ABN , First Publish Date - 2020-06-22T19:27:56+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఒంగోలులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి ఒంగోలు నగరం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని, 14 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.