నేడు తేలికపాటి వాన జల్లులు
ABN , First Publish Date - 2020-12-17T08:31:21+05:30 IST
శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ ఆవర్తనం ప్రస్తుతం కొమెరిన్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో 2.1

అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఈ ఆవర్తనం ప్రస్తుతం కొమెరిన్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో 2.1 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగానే ఉంటుందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాత్రి వేళ చలి గాలులు కొనసాగుతున్నాయి. నందిగామలో 17.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.