కేంద్ర మంత్రి హర్షవర్దన్కు నారా లోకేష్ లేఖ
ABN , First Publish Date - 2020-12-08T01:21:24+05:30 IST
కేంద్ర మంత్రి హర్షవర్దన్కు నారా లోకేష్ లేఖ రాశారు. ఏలూరులో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని లేఖలో లోకేష్ కోరారు. ఏలూరులో వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారని గుర్తుచేశారు

అమరావతి: కేంద్ర మంత్రి హర్షవర్దన్కు నారా లోకేష్ లేఖ రాశారు. ఏలూరులో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని లేఖలో లోకేష్ కోరారు. ఏలూరులో వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారని తెలిపారు. రికవరీ రేటు అధికంగా నమోదు చేసేందుకు త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారని పేర్కొన్నారు. మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని లేఖలో నారా లోకేష్ వివరించారు.