ఇది రాక్షసులను తుదముట్టించే రామదండు: లంకా దినకర్
ABN , First Publish Date - 2020-07-06T17:03:54+05:30 IST
వైసీపీ నేతలపై బీజేపీ నేత లంకా దినకర్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. పార్టీ నేతలను మిడతల దండుతో
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని అధికార పార్టీ వైసీపీ నేతలపై బీజేపీ నేత లంకా దినకర్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. పార్టీ నేతలను మిడతల దండుతో పోల్చడంపై ఫైర్ అయిన ఆయన ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాలకేయలే గుంపుగా ప్రజలపై దాడులు చేస్తున్నారని, ప్రజా రక్షకులను మిడతల దండు అంటున్నారని పేర్కొన్నారు. తమది రాక్షసులను తుదముట్టించే రామదండని, కొంత మందికి చెమటలు మొదలయ్యాయని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
అంతకుముందు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేతలను మిడతలతో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయన్నారు. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.