చిత్తూరులో రెండు కుటుంబాల మధ్య భూవివాదం
ABN , First Publish Date - 2020-07-20T01:44:23+05:30 IST
చిత్తూరులో రెండు కుటుంబాల మధ్య భూవివాదం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట మండలం కొత్తవుడియంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నెలకొంది. భూ వివాదంలో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. ఓ వర్గంలోని భార్య భర్తలు కదిరప్ప(38) సుజాత (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బి. కొత్తకోట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.