అనంతపురంలో ఏరో స్పేస్ సంస్థకు భూ కేటాయింపు
ABN , First Publish Date - 2020-04-26T15:28:42+05:30 IST
అనంతపురంలో ఏరో స్పేస్ సంస్థకు భూ కేటాయింపు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో మరో మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద మెస్సర్స్ ఏపీ ఏరో స్పేస్ డిఫఎన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ లిమిటెట్ ఏర్పాటు కోసం 246 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీతో కలిసి ఏరో స్సేస్, డిఫెన్స్ వాటర్ ఇన్నోవేషన్ ఎలక్ట్రానికి సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల ప్రత్యేక వాహక సంస్థగా ఏపీ-ఏడీఈ ఏర్పాటు కానుంది. కియా మోటార్స్ ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో కాలుష్య కారక పరిశ్రమలను అనుమతించబోమన్న ప్రభుత్వ నిబంధనల నుంచి ఈ సంస్థకు కూడా మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కియా మోటార్స్ ప్రాజెక్టు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కియాకు చెందిన మరో అనుబంధ సంస్థ ఈ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్నందున ఈ మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.