నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం
ABN , First Publish Date - 2020-07-08T08:23:50+05:30 IST
‘‘మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీ(వైసీపీ) ఎంపీల ట్వీట్లు, కామెంట్లు ఏంటి? కౌన్సెలింగ్ ఇచ్చి అదుపులో

- జగన్.. మీ ఎంపీలను అదుపులో పెట్టుకోండి: కన్నా
అమరావతి, విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘‘మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీ(వైసీపీ) ఎంపీల ట్వీట్లు, కామెంట్లు ఏంటి? కౌన్సెలింగ్ ఇచ్చి అదుపులో పెట్టుకోండి. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’’ అని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరుతుండటం పై వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ట్వీట్లు చేశారు. వాటిపై సీరియ్సగా స్పందించిన కన్నా మంగళవారం జగన్కు లేఖ రాశారు. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథరాజు విశాఖలో మాట్లాడుతూ.. మిడతల దండును వైసీపీపైకే ప్రయోగిస్తామన్నారు.