ఇళ్లకే పరిమితం అయిన రోజు వారీ కూలీలు
ABN , First Publish Date - 2020-03-27T16:47:54+05:30 IST
కరోనా వైరస్ కారణంగా విజయవాడలో రోజు వారీ కూలీలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
విజయవాడ: కరోనా వైరస్ కారణంగా విజయవాడలో రోజు వారీ కూలీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్తో ఐదు రోజుల నుంచి పనులు లేక పస్తులున్నారు. దీంతో సీపీఎం నాయకులు పేదలు, కూలీలకు భోజన వసతి కల్పించారు. బెజవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో ఎనిమిది డివిజన్లలో 20వేల మందికి ఆహారం అందించారు. సీపీఎం కార్యకర్తలు పేదల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.