ఓ వైపు కరోనా భయం.. మరోవైపు అప్పులు తీర్చలేక..

ABN , First Publish Date - 2020-06-04T00:54:40+05:30 IST

జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు కరీఫ్, రబీలో పండిన ఉత్పత్తులు అమ్ముకునే..

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు అప్పులు తీర్చలేక..

కర్నూలు: జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు కరోనా భయం.. మరోవైపు కరీఫ్, రబీలో పండిన ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లేకపోవడంతో ఒక్కపూట కూడా ముద్ద దిగడంలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. 


అందరికి అన్నంపెట్టే రైతన్న అప్పుల ఊబిలో చిక్కుకుని ఉసురుతీసుకుంటున్నారు. కొందరు ఉరి కొయ్యకు వేలాడితే మరికొందరు పురుగుల మందు ప్రాణం తీసుకుంటున్నారు. 


కర్నూలు జిల్లాలో పశ్చిమప్రాంతం కరువుకు కేరాఫ్ అడ్రస్. అయినా గత ఏడాది వర్షాలు పడి పంటలు బాగాపండటంతో దిగుబడులు బాగానే వచ్చాయి. కొంతమంది రైతులు ముందుగానే పంట ఉత్పత్తులు అమ్ముకోగా మరికొందరు గిట్టుబాటు కోసం వేచి చూస్తున్న సమయంలో లాక్‌డౌన్ విధించారు. 


Updated Date - 2020-06-04T00:54:40+05:30 IST