మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం

ABN , First Publish Date - 2020-12-19T15:07:40+05:30 IST

కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం

కర్నూలు జిల్లా: మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం పుష్కర ఘాట్ల పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. బీజేపీ, వైసీపీ కార్యక్రమాలతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Updated Date - 2020-12-19T15:07:40+05:30 IST