ఓంకారం క్షేత్రంలో ఘర్షణ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సస్పన్షన్
ABN , First Publish Date - 2020-12-02T02:22:47+05:30 IST
ఓంకారం క్షేత్రంలో ఘర్షణ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సస్పన్షన్

కర్నూలు: ఓంకారం క్షేత్రంలో అసిస్టెంట్ కమిషనర్, అర్చకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషనాయుడు అన్యాయం చేస్తున్నాడని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేసీ వెంకటేశ్వర్లు ముందే ఆదిశేషనాయుడిని దుర్బాషలాడిన అర్చకులు ఉమ్మేవేశారు. ఆదిశేషనాయుడిని తొలగించాలని ఆర్జేసీకి అర్చక సంఘం వినతిపత్రం అందజేసింది. పూజారులపై దాడి ఘటనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈశ్వరయ్య, నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేశారు.