పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమలలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2020-04-05T16:36:50+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఒక ఇంటి ముందు

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఒక ఇంటి ముందు క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని చెరువు వీధిలో ఓ ఇంటి ముందు బొమ్మ, పసుపు, కుంకుమ, ముగ్గు, నిమ్మకాయలతో చేతబడి పూజలు చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిందెవరు..? ఎందుకు చేసి ఉంటారు..? అనే దానిపై స్థానికులు ఆరా తీస్తున్నారు.