సచివాలయ ఉద్యోగి చేతివాటం....ఇసుక అనుమతుల్లో గోల్‌‌మాల్

ABN , First Publish Date - 2020-06-23T16:56:08+05:30 IST

సచివాలయ ఉద్యోగి చేతివాటం....ఇసుక అనుమతుల్లో గోల్‌‌మాల్

సచివాలయ ఉద్యోగి చేతివాటం....ఇసుక అనుమతుల్లో గోల్‌‌మాల్

కృష్ణా: ఇసుక అనుమతుల్లో మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ సచివాలయ ఉద్యోగి గ్రేడ్ 5 సెక్రటరీ కంభంపాటి సుధాకర్ రావు చేతి వాటం ప్రదర్శించాడు. గ్రామంలోని వాగులో ఇసుక అనుమతులకు సంబంధించి గోల్‌మాల్ జరిగింది. ఆన్‌లైన్లో బుక్ చెయకుండానే ఇసుక రవాణాకు సుధాకర్ కూపన్లు జారీ చేశాడు. ఒక కూపన్‌తో రెండు, మూడు ట్రాక్టర్‌లతో ఇసుకను తరలించినట్లు సమాచారం. దాదాపు రూ.82వేల ఇసుక స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కార్యదర్శి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ స్కామ్ వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. 

Updated Date - 2020-06-23T16:56:08+05:30 IST