అవినీతిపరులెవరో త్వరలో తేలుతుంది: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-02-24T09:27:43+05:30 IST
‘‘దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సాక్షిగా చెబుతున్నా.. అవినీతి పరులెవరో త్వరలోనే తేలిపోతుంది’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
శ్రీకాకుళం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సాక్షిగా చెబుతున్నా.. అవినీతి పరులెవరో త్వరలోనే తేలిపోతుంది’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఎర్రన్న ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈఎ్సఐ మందుల విషయమై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి సత్తా ఉంటే ఏమైనా చేసుకోండని.. ఇదే విషయాన్ని ఎర్రన్న సాక్షిగా చెబుతున్నానని అన్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు.. అంటే సీఎం జగన్కి భయమని అన్నారు.