అప్పుడయినా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని
ABN , First Publish Date - 2020-03-15T17:42:20+05:30 IST
రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ....
![అప్పుడయినా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని](https://media.andhrajyothy.com/appimg/galleries/2020031512103532/03152020121211n48.jpg)
విజయవాడ: రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలా పాటు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్పై మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు బిహార్ను మించిపోయాయని చెప్పారు. ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. 6 వారాల తర్వాత అయినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పోలీసులు అధికార పార్టీ ఆదేశాలు కాదు..చట్టానికి లోబడి పనిచేయాలని కేశినేని సూచించారు.