కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం

ABN , First Publish Date - 2020-03-19T02:51:55+05:30 IST

కరోనా వైరస్‌పై గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు.

కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం

హైదరాబాద్: కరోనా వైరస్‌పై గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి, మహమూద్‌అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు సమాచారం అందించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు కేసీఆర్‌ ఆహ్వానం పంపారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌ వచ్చిన విదేశీయులకు కరోనా లక్షణాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులపై నేతలు చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవాలని సీఎం సూచించారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని, కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు.

Updated Date - 2020-03-19T02:51:55+05:30 IST