17న వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్-3 ప్రారంభం
ABN , First Publish Date - 2020-02-12T12:06:28+05:30 IST
17న వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్-3 ప్రారంభం
![17న వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్-3 ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు: డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఫేజ్-3ని ఈనెల 17వ తేదీన ప్రారంభింస్తున్నట్లు ఇన్చార్జి డీఎంహెచ్వో పెంచలయ్య తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్షించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్పై ఐఈసీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్వో అరుణసులోచన దేవి, ఆర్బీఎస్కే డీసీ సుదర్శన్, ఎస్వో రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.