జగన్కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
ABN , First Publish Date - 2020-04-08T21:19:46+05:30 IST
సీఎం జగన్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి ప్రజలు పారిపోతున్నారని లేఖలో తెలిపారు.

అమరావతి: సీఎం జగన్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాథమిక సౌకర్యాలు లేక ఐసోలేషన్ల నుంచి ప్రజలు పారిపోతున్నారని లేఖలో తెలిపారు. ఐసోలేషన్ కేంద్రాల్లో వసతులను మెరుగుపర్చాలని కోరారు. ఐసోలేషన్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి... తగిన వ్యక్తిగత సామాగ్రి ఏర్పాటు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.