ఈడబ్ల్యూఎస్‌ 10% అమలు చేయించండి

ABN , First Publish Date - 2020-06-19T09:56:06+05:30 IST

ఉన్నత కులాలకు చెందిన ఆర్థిక బలహీనులకు రిజర్వేషన్ల అమలులో న్యాయం చేయాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు బీజేపీ ..

ఈడబ్ల్యూఎస్‌ 10% అమలు చేయించండి

గవర్నర్‌కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లేఖ


అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఉన్నత కులాలకు చెందిన ఆర్థిక బలహీనులకు రిజర్వేషన్ల అమలులో న్యాయం చేయాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన చారిత్రక ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గవర్నర్‌కు రాసిన లేఖలో కన్నా పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వృత్తి నిపుణులు నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు కోసం రాష్ట్రంలో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-06-19T09:56:06+05:30 IST