కడప జిల్లాలో 23కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-05T17:08:26+05:30 IST
కడప జిల్లాలో 23కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
కడప: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 23కు పెరిగింది. కేవలం ప్రొద్దుటూరులోనే పాజిటివ్ కేసులు 10కి చేరడంతో హైఅలర్ట్ ప్రకటించారు. పులివెందుల 2, వేంపల్లె 2, కడప 6, బద్వేల్లో మూడు పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ సభకు వెళ్ళి వచ్చిన వారు తిరిగిన ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.