నక్సలైట్లలో చేరతా.. పరువు కాపాడుకుంటా
ABN , First Publish Date - 2020-08-11T08:39:24+05:30 IST
‘నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి. ఇక్కడ ఎవరూ నాకు న్యాయం చేయడంలేదు’... అంటూ ఏకంగా రాష్ట్రపతికి ఒక లేఖ వెళ్లింది.

- రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడి లేఖ
రాజమహేంద్రవరం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి. ఇక్కడ ఎవరూ నాకు న్యాయం చేయడంలేదు’... అంటూ ఏకంగా రాష్ట్రపతికి ఒక లేఖ వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్లో శిరోముండనానికి గురైన ఇండుగుమిల్లి ప్రసాద్... రాష్ట్రపతి గ్రీవెన్స్కు ఈ మేరకు లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్ఐ శిరోముండనం చేశారని, హింసించారని అందులో వివరించారు. కాగా ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్కు చేరిందని, పరిశీలనలో ఉందని స్టేట్సలో తెలపడం విశేషం. ‘నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది. 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా శిరోముండనాన్ని సీరియ్సగా భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ విషయంలో ఏడుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు వేశారు. అందులో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు ఆఫీసర్. అతడు సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు ఎస్ఐని అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. కానీ 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. వీరే ప్రధాన కారకులు. ఇక్కడ ఎస్ఐ కేవలం ఉద్యోగంలో చేరి 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. శిరోముండనం విషయాన్ని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం ఎస్పీ కూడా పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే న్యాయం జరగడంలేదు. నేను పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు విఫలమయ్యాయి’ అని లేఖలో పేర్కొన్నారు.