నైపుణ్య శిక్షణ పొందిన 27మందికి ఉద్యోగాలు
ABN , First Publish Date - 2020-12-11T07:17:06+05:30 IST
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ-జేబీఎం ఆధ్వర్యంలో న్యాప్స్ ప్రోగ్రామ్ శిక్షణ పూర్తయిన మొదటి బ్యాచ్లోని 27మందికి ఉద్యోగాలు
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ-జేబీఎం ఆధ్వర్యంలో న్యాప్స్ ప్రోగ్రామ్ శిక్షణ పూర్తయిన మొదటి బ్యాచ్లోని 27మందికి ఉద్యోగాలు వచ్చాయి. చెన్నైలోని జేబీఎం ప్లాంట్లో వీరికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని నైపుణ్యాభివృద్ది సంస్థ సీఈవో అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఆయన నేతృత్వంలోని సంస్థ బృందం గురువారం చెన్నైలోని జేబీఎం ప్లాంటు, ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలను సందర్శించింది. ఇంజనీరింగ్తో పాటు, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జేబీఎం సంస్థ అంగీకరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.