పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-08-16T16:41:57+05:30 IST
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు నేడు కస్టడీకి తీసుకున్నారు.

అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు నేడు కస్టడీకి తీసుకున్నారు. భద్రత మధ్య కడప సెంట్రల్ జైలు నుంచి జేసీ ప్రభాకర్ను అనంతపురం తీసుకొచ్చిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే విచారణ ప్రారంభమైంది.
ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జేసీ ప్రభాకర్రెడ్డిని ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించేందుకు ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 6న వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగం కేసులో బెయిల్పై విడుదలై తాడిపత్రికి వచ్చే సమయంలో బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్రకుమార్ను కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిన విషయం విదితమే.