హైకోర్టును ఆశ్రయించిన జేసీ ఫ్యామిలీ

ABN , First Publish Date - 2020-06-22T15:19:59+05:30 IST

బెయిల్ కోసం జేసీ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రెడ్డి భార్య న్యాయస్థానంలో పిటిషన్

హైకోర్టును ఆశ్రయించిన జేసీ ఫ్యామిలీ

విజయవాడ: బెయిల్ కోసం జేసీ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రెడ్డి భార్య న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అలాగే అక్రమ అరెస్టులు చేసిందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. భర్తకు, కుమారుడికి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది.


Updated Date - 2020-06-22T15:19:59+05:30 IST