రైతుల వద్దకు పవన్!
ABN , First Publish Date - 2020-12-01T09:41:04+05:30 IST
తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు
తుఫాను ప్రాంతాల్లో 4 రోజుల పర్యటన
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. బుధవారం పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు. 4,5 తేదీల్లో శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాలకు వెళతారు.