ఎకరాకు 35 వేలు పరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్

ABN , First Publish Date - 2020-12-15T20:34:29+05:30 IST

తుఫాన్‌ల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలంటూ ఈనెల 28న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన నిర్ణయం తీసుకుంది

ఎకరాకు 35 వేలు పరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్

అమరావతి: తుఫాన్‌ల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతుల్ని ఆదుకోవాలంటూ ఈనెల 28న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన నిర్ణయం తీసుకుంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎకరాకు రూ. 35 వేలు పరిహారం అందించాలని.. తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్‌ చేసింది. ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు.

Updated Date - 2020-12-15T20:34:29+05:30 IST