రేపు జనసేన కీలక సమావేశం
ABN , First Publish Date - 2020-08-01T20:59:50+05:30 IST
మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం జరగనుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో రేపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అత్యవసర
![రేపు జనసేన కీలక సమావేశం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020080101331998/08012020152826n60.jpg)
అమరావతి: మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం జరగనుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో రేపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్లో భవిష్యత్తు కార్యాచరణ, మూడు రాజధానులపై నేతలు అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరపున ఏ విధంగా అండగా ఉండాలి అనే దానిపైన కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/2020080101331998/08012020152943n19.jpg)