ఏపీ ప్రజల ప్రాణాలతో జగన్‌ ఆడుకుంటున్నారు: జనసేన నేత

ABN , First Publish Date - 2020-06-07T03:24:09+05:30 IST

ఏపీ ప్రజల ప్రాణాలతో జగన్‌ ఆడుకుంటున్నారని జనసేన నేత వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ..

ఏపీ ప్రజల ప్రాణాలతో జగన్‌ ఆడుకుంటున్నారు: జనసేన నేత

హైదరాబాద్ : ఏపీ ప్రజల ప్రాణాలతో జగన్‌ ఆడుకుంటున్నారని జనసేన నేత వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో జరిగిన ది డిబెట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నవరత్నాల రూపంలో ఇస్తూ కరెంట్‌ బిల్లుల రూపంలో ఆ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారన్నారు. సరైన మద్యం దొరక్క ప్రజలు శానిటైజర్లు తాగుతున్నారని.. వైసీపీ ప్రభుత్వం పేదల రక్తాన్ని పిండుతోందన్నారు.


సామాన్యులు, బిల్డర్లకు ఇసుక అందే పరిస్థితి లేదన్నారు. నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమకు ఇసుక తరలిపోతోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బంధువుకి నామినేటెడ్‌ పద్ధతిలో ఇసుక రీచ్‌ ఇచ్చారన్నారు. తమ నియోజకవర్గాలకు ఇసుక అందడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వినోద్‌ చెప్పారు. బీసీల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని వినోద్‌ తెలిపారు.

Updated Date - 2020-06-07T03:24:09+05:30 IST