సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

ABN , First Publish Date - 2020-10-03T13:08:50+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు.

సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామ, వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. అలాగే 11 గంటలకు ముఖ్యమంత్రి కూడా పులివెందులకు వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2020-10-03T13:08:50+05:30 IST