జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేశారు: కొడాలి నాని
ABN , First Publish Date - 2020-12-30T23:31:39+05:30 IST
సీఎం జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా జూమ్లో మీటింగులు పెట్టలేదని ప్రశ్నించారు.
ఏలూరు: సీఎం జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేశారని మంత్రి కొడాలి నాని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా జూమ్లో మీటింగులు పెట్టలేదని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేశారని తప్పుబట్టారు. దొంగమాటలు చెప్పి చంద్రబాబు ఐదేళ్లు గడిపారని విమర్శించారు. 151 సీట్లు వచ్చిన జగన్ను ఫేక్ ముఖ్యమంత్రి అంటారా? అని ఆయన ప్రశ్నించారు. ప్యాకేజీ గాళ్లు, గుంటనక్కలు జగన్పై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.