గవర్నర్‌ను కలిసిన జగన్

ABN , First Publish Date - 2020-06-22T22:28:54+05:30 IST

గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం జగన్ కలిశారు. మండలిలో జరిగిన తీరు, బిల్లులు పెండింగ్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో..

గవర్నర్‌ను కలిసిన జగన్

అమరావతి: గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం జగన్ కలిశారు. మండలిలో జరిగిన తీరు, బిల్లుల పెండింగ్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. కేబినెట్‌లో మార్పులపై చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు జగన్ వివరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు అయిన వెంటనే గవర్నర్‌ను ఒకసారి కలవడం ముఖ్యంత్రులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారని తెలియవచ్చింది.

Updated Date - 2020-06-22T22:28:54+05:30 IST