పొగాకు రైతుల ఇబ్బందులపై జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-06-18T20:52:33+05:30 IST

అమరావతి: పొగాకు రైతుల ఇబ్బందులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

పొగాకు రైతుల ఇబ్బందులపై జగన్ సమీక్ష

అమరావతి: పొగాకు రైతుల ఇబ్బందులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోనుంది. ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లను నిర్వహించనుంది. దీనికోసం 2–3 రోజుల్లో ప్రత్యేక సంస్థను జగన్ ఏర్పాటు చేయనున్నారు. ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఈ సంస్థ పని చేయనుందని జగన్ పేర్కొన్నారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు, కంపెనీ నియమాల ప్రకారం వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనగోళ్లు జరపాలని.. లేకపోతే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జగన్ హెచ్చరించారు. 


Updated Date - 2020-06-18T20:52:33+05:30 IST