జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: బోండా ఉమ
ABN , First Publish Date - 2020-08-13T01:28:13+05:30 IST
సీఎం జగన్ ప్రభుత్వం 15 నెలల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. జగన్ వచ్చాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు
అమరావతి: సీఎం జగన్ ప్రభుత్వం 15 నెలల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. జగన్ వచ్చాక రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని, గత ప్రభుత్వ హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.. జగన్ 15 నెలల పాలనలో ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. కానీ రూ.లక్ష కోట్ల అప్పులు చేశారని బోండా ఉమ దుయ్యబట్టారు.