జగన్ దేశ రాజకీయాలను శాసిస్తారు:
ABN , First Publish Date - 2020-09-03T08:38:29+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన

ధర్మాన
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలనలోనే ప్రజల మనసులు గెలుచుకున్న జగన్ త్వరలో దేశ రాజకీయాలను శాసిస్తారని జోస్యం చెప్పారు.
బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిని చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు.