జాతీయ ఫెలోషిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-09-16T16:00:13+05:30 IST
ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఫెలోషిప్, స్కాలర్షిప్నకు ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన,

అనంతపురం: ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఫెలోషిప్, స్కాలర్షిప్నకు ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన, సంక్షేమ శాఖాధికారి అన్నాదొర మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకే పూర్తి చేసిన, ప్రస్తుతం చేస్తున్న ఎంఫిల్, పీహెచ్డీలో ప్రవేశం పొందిన ఎస్టీ విద్యార్థులు అర్హులన్నారు. వివరాలకు 08554-246151 నెంబరులో గానీ, పెన్నార్భవన్లో నేరుగా గానీ సంప్రదించాలని కోరారు. http:fellowship.tribal.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు.