గాలిలో పెరిగిన తేమ
ABN , First Publish Date - 2020-12-28T10:00:21+05:30 IST
తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ ...
అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య గాలులతో గాలిలో తేమశాతం పెరుగుతోంది. ఉత్తరకోస్తాలో 70ు పైగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో 80-95ు తేమ నమోదవుతోందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ, రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలు, తీరప్రాంతాలు, హైవే రోడ్లపై అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. సాయంత్రం 4గంటల నుంచే చలి మొదలవుతోంది. విశాఖ ఏజెన్సీ జి.మాడుగులలో ఆదివారం 4.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.