ధైర్యం ఉంటే ఆ వీడియోను బయటపెట్టండి: అశోక్ బాబు

ABN , First Publish Date - 2020-06-18T22:47:34+05:30 IST

ధైర్యం ఉంటే ఆ వీడియోను బయటపెట్టండి: అశోక్ బాబు

ధైర్యం ఉంటే ఆ వీడియోను బయటపెట్టండి: అశోక్ బాబు

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. కరోనాతో సహజీవనం చేయాలన్న ముఖ్యమంత్రి  అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు మాత్రమే ఎందుకు పెట్టారో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. గతంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి సభ్యులు పంపినప్పుడు సెక్రటరీ ఏ విధంగా వాటిని ఆపుతారని? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని అన్నారు. వైసీపీ వాళ్లకు బడ్జట్ కంటే ఈ రెండు బిల్లులే ముఖ్యంలా ఉన్నాయని అశోక్ బాబు ప్రశ్నించారు. మంత్రులు ప్యాంటు జిప్పులు తీసి చూపించారని, ఇటువంటి వాళ్లు మినిస్టర్లుగా ఉన్నందుకు తాము సిగ్గుపడుతున్నామని తెలిపారు. అప్రాప్రియేషన్ బిల్లు ఆగిపోతే జీతాలు ఆపోతాయని యనమల రామకృష్ణుడు 1000 సార్లు చెప్పారని, అయినా లెక్కచేయలేదని అశోక్ బాబు మండిపడ్డారు. లోకేష్ పై దాడి చేయడానికి మంత్రి ప్రయత్నించారని, మీకు ధైర్యం ఉంటే వీడియో పూటేజిని ప్రజల ముందు పెట్టాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.


Updated Date - 2020-06-18T22:47:34+05:30 IST