ఎంపీటీసీలకు 50,064 జడ్పీటీసీలకు 4,778 నామినేషన్లు
ABN , First Publish Date - 2020-03-13T09:04:06+05:30 IST
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. 13 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్న 652 జడ్పీటీసీలకుగాను 4,778 నామినేషన్లు...
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. 13 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్న 652 జడ్పీటీసీలకుగాను 4,778 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 4,355 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీలకు సంబంధించి రాష్ట్రలోని 9696 స్థానాలకుగాను 50,064 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ నామినేషన్లను అధికారులు పరిశీలించారు. పోటీ నుంచి విరమించుకోవాలనే అభ్యర్థులు శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తారు.
జడ్పీటీసీ నామినేషన్లు
జిల్లా మొత్తం దాఖలైన
స్థానాలు నామినేషన్లు
శ్రీకాకుళం 38 281
విజయనగరం 34 241
విశాఖపట్నం 39 296
తూర్పుగోదావరి 61 482
పశ్చిమగోదావరి 48 370
కృష్ణా 46 331
గుంటూరు 54 388
ప్రకాశం 55 394
నెల్లూరు 46 330
కర్నూలు 53 351
అనంతపురం 63 474
చిత్తూరు 65 480
కడప 50 341