మేనిఫెస్టోలో లేకున్నా కాపులకు కోటా..

ABN , First Publish Date - 2020-08-22T09:44:34+05:30 IST

ఒక్క సంజీవయ్య హయాంలో తప్ప, రాష్ట్రాన్ని ఏలిన కమ్మ, రెడ్ల సీఎంలు ఏనాడూ కాపుల సంక్షేమాన్ని కోరుతూ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించడానికి ..

మేనిఫెస్టోలో లేకున్నా కాపులకు కోటా..

సీఎం జగన్‌కు హరిరామజోగయ్య వినతి


పాలకొల్లు, ఆగస్టు 21: ఒక్క సంజీవయ్య హయాంలో తప్ప, రాష్ట్రాన్ని ఏలిన కమ్మ, రెడ్ల సీఎంలు ఏనాడూ కాపుల సంక్షేమాన్ని కోరుతూ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోలేదని కాపు సంక్షేమ సేన కన్వీనర్‌, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య విమర్శించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం లేకున్నప్పటికీ కోటా ఇవ్వడం ద్వారా కాపులను ప్రసన్నం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. ఈ మేరకు సీఎంకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. తమ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాలలో అవకాశాలు మెరుగుపరచాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు.

Updated Date - 2020-08-22T09:44:34+05:30 IST