గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం
ABN , First Publish Date - 2020-05-17T14:10:00+05:30 IST
జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
![గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051708204920/05172020083935n46.jpg)
గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న వాహనం-ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వలస కూలీలు చెన్నై నుంచి బిహార్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.