గుంటూరు: శవాలతో నిండిపోయిన జీజీహెచ్ మార్చురీ

ABN , First Publish Date - 2020-07-27T18:06:16+05:30 IST

గుంటూరు: శవాలతో నిండిపోయిన జీజీహెచ్ మార్చురీ

గుంటూరు: శవాలతో నిండిపోయిన జీజీహెచ్ మార్చురీ

గుంటూరు: జిల్లాలోని జీజీహెచ్ శవాలతో నిండిపోయింది. 30 శవాల కెపాసిటీ గల మార్చురీలో 50 వరకు శవాలు ఉన్నాయి. కోవిడ్ పరీక్ష ఫలితాలలో జాప్యం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఫలితాలు వచ్చే వరకు మృతదేహాలను అప్పగించేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 98 మంది అధికారికంగా మృతి చెందారు. జీజీహెచ్‌లో ఏ రోగంతో మృతి చెందిన కోవిడ్ పరీక్షల తర్వాతే వైద్యసిబ్బంది శవాన్ని అప్పగిస్తున్నారు. 

Updated Date - 2020-07-27T18:06:16+05:30 IST