దాచేపల్లిలో అంతు చిక్కని వ్యాధి ఏమీ లేదు: ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-14T01:23:41+05:30 IST

దాచేపల్లిలో అంతు చిక్కని వ్యాధి ఏమీ లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని

దాచేపల్లిలో అంతు చిక్కని వ్యాధి ఏమీ లేదు: ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

గుంటూరు: దాచేపల్లిలో అంతు చిక్కని వ్యాధి ఏమీ లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. పల్లపు రామకృష్ణ అనారోగ్యంతోనే అస్వస్దతకు గురయ్యాడని తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యంపై కమిటీ వేస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మహేష్‌రెడ్డి ప్రకటించారు. దాచేపల్లి మండలం నడికుడిలో కాలనీవాసులు స్పృహతప్పి పడిపోతున్నారు. కాలనీకి చెందిన ఓ యువకుడు స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సదరు యువకుడిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు స్పృహతప్పి పడిపోయారు. దీనికి రసాయన పరిశ్రమల కాలుష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 







Updated Date - 2020-12-14T01:23:41+05:30 IST