-
-
Home » Andhra Pradesh » guntur corona
-
గుంటూరు జిల్లాలో మరో నాలుగు కరోనా అనుమానిత కేసులు
ABN , First Publish Date - 2020-03-26T02:04:40+05:30 IST
గుంటూరు జిల్లాలో మరో నాలుగు కరోనా అనుమానిత కేసులు

గుంటూరు: జిల్లాలో మరో నాలుగు కరోనా అనుమానిత కేసులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు 25 మందికి కరోనా టెస్ట్లు చేశారు. 14 మందికి నెగిటివ్ రాగా మరో 11 మంది రిపోర్ట్లు రావాల్సివుందని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి నుంచి ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. ఐసోలేటెడ్ వార్డుల్లో 19 మందికి చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో 2,431 మంది ఉన్నట్లు తెలిసింది.